28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

మంటగలిసిన మానవత్వం

19-04-2025 09:34 PM

చేను మేసిందని గొడ్డలితో గోవుపై దాడి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): గోవు చేను మేసిందని ఆగ్రహించి.. మానవత్వాన్ని కూడా మరిచి ఓ వ్యక్తి గొడ్డలితో గోవు పై దాడి చేసిన అమానుష ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్య తండా (బి) జరిగింది. గ్రామానికి చెందిన బానోతు శంకర్ అనే రైతుకు చెందిన గోవు మాలోతు బాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన జొన్న చేను మేయడాన్ని చూసి గొడ్డలితో బాలకృష్ణ గోవుపై దాడి చేశాడు. ఈ ఘటనలో గోవుకు బలమైన గాయమైంది. ఈ విషయంపై బాధిత రైతు బానోతు శంకర్ దాడి చేసిన మాలోత్ బాలకృష్ణ పై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.