calender_icon.png 30 May, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ వద్ద ధర్నాకు వందలాదిగా కార్మికులు తరలిరావాలి..

29-05-2025 09:15:15 PM

వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య..

మునుగోడు (విజయక్రాంతి): పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాకు వందలాదిగా కార్మికులు తరలిరావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(Telangana Agricultural Workers Union) కార్యదర్శి నారి ఐలయ్య(Nari Ilayya) పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. పేదలు కష్టజీవులు తమ జీవనోపాధి కోసం, పని, భూమి భువ్వ కోసం పోరాడి హక్కులు, చట్టాలు సాధించుకుంటే కేంద్రంలోని ఈ మోడీ ప్రభుత్వం ఆహక్కులను, చట్టాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నదని విమర్శించారు.

దేశానికి గ్రామ సీమలే పట్టుకొమ్మలు గ్రామాలలో ఉన్న ప్రజలు ఆర్థికంగా బలపడితేనే ఈ దేశం ముందుకు పోతుందనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వము వందరోజుల పనిని తెస్తే ఈనాడు ఈ మోడీ ప్రభుత్వం దానిని ఎత్తివేయడానికి అనేక కుట్రలు చేస్తూ కొత్త జీవోలు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రొజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించి నూతన జాబ్ కార్డులు  ఇవ్వాలి గడ్డపార, తట్ట, పారా, కొడవలి, గొడ్డలి లాంటి పనిముట్లు ఇవ్వాలని పనిచేసే దగ్గర నీరు, నీడ  టెంటు, మెడికల్ కిట్టు సౌకర్యాలు కల్పించాలి.

అన్నీ కల్పించని సందర్భంగా 15 రోజులు దాటితే సమ్మర్ అలవెన్స్ నాలుగు కిలోమీటర్ల దూరం దాటితే లోకల్ ఆటో చార్జీలు, ఉపాధి సిబ్బంది పెండింగ్ వేతనాలు, చెల్లించి చట్టం వచ్చిన నాటి నుండి పనిచేసిన ఉపాధి సిబ్బందిని  పర్మినెంట్ చేసి వారి యొక్క వేతనాలు పెంచాలి, వాచర్లను, సీనియర్ మేట్లను ప్రత్యేకంగా గుర్తించి సంవత్సరం మొత్తం పనులు కల్పించడంతో పాటు అర్హత కలిగిన వారికి ఫీల్డ్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలి ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యంతో పాటు, పని చేయని రోజులలో నష్టపరిహారం చెల్లించి  ప్రమాదంలో మరణిస్తే కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి దరఖాస్తు పెట్టుకొని పని చూపని వారికి చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి ఇలాంటి సమస్యల సాధన కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాలో ఉపాధి  కార్మికలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బండ శ్రీశైలం, సాగర్ల మల్లేష్, మిర్యాల భరత్, యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, ఎండి సిద్ధిక్, నరేష్, యాట గణేష్, రేవెల్లి యాదయ్య ఉన్నారు.