calender_icon.png 30 May, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు వెంటనే నిర్మాణాలను మొదలుపెట్టాలి..

29-05-2025 09:11:49 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

మునుగోడు (విజయక్రాంతి): ఇల్లు మంజూరై ఇప్పటి వరకు ప్రారంభించని వారు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఆదేశించారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలోని పైలెట్ ప్రాజెక్ట్ గ్రామంగా ఎంపికైన (దుబ్బగూడెం) ఉడుతలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించి మాట్లాడారు. 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, చండూరు ఆర్డీవో రమణారెడ్డి, ఎమ్మార్వో కిరణ్మయి, ఎంపీడీవో యాదగిరి, ఎంపీవో మాధవరెడ్డి, హౌసింగ్ ఈ ఈశ్వర్, కోరిమి ఓంకారం, మార్కెట్ కమిటీ డైరక్టర్ భూతరాజ ఆంజనేయులు, పంచాయితీ కార్యదర్శి శంకర్ ఉన్నారు.