04-07-2025 01:19:29 AM
- నెన్నెల మండలంలో దారుణం
బెల్లంపల్లి అర్బన్, జూలై 3: అనుమానమే పెనుభూతమై ఓ మహిళను బలి తీసు కున్న సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలoలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నె ల మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముడిమడుగుల తులసి(35) ని తెల్లవారుజామున ఆమె భర్త ముడిమడుగుల తిరుపతి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమెపై తెల్లవారు జామున ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో తులసీ అక్కడికక్కడే మృతి చెందింది.
భార్య తులసి పై అనుమానం పెంచుకున్న తిరుపతి ఆమెపై కోపం పెంచుకున్నాడు. అది కాస్త ఆమెను అంతమొందించే వరకూ దారి తీసింది. ముడిమడుగుల తిరుపతి తాగుడుకు బానిసయ్యి పనిపాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. భర్త తాగుడుకి బానిస కావడంతో కుటుంబపోషణ కష్టంగా మారిం ది. నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం తులసి కూలి పనికి వెళ్తుండేది. ఈ క్రమంలో భార్యపై మరింత అనుమానం పెంచుకున్నా డు తిరుపతి. ఆమెను ఎలాగైనా చంపాలని స్కెచ్ వేశాడు.
ఇంట్లోనే నిద్రిస్తున్న ఆమెపై గొడ్డలితో దాడిచేసి హతమార్చాడం గ్రామంలో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదే హాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.