11 April, 2026 | 3:53 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

అనుమానం.. క్రికెట్ బ్యాట్‌తో భార్యను కొట్టి చంపిన భర్త

10-11-2025 12:12 PM

హైదరాబాద్:  వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను క్రికెట్ బ్యాట్‌తో(Cricket Bat) కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్(Aminpur) పట్టణం కేఎస్ఆర్ నగర్‌లో జరిగింది. కేఎస్ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న బ్రహ్మయ్య- క్రిష్ణవేణి భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇంటర్ చదివే ఒక కూతురు, 8వ తరగతి చదివే బాలుడు ఉన్నారు. 

క్రిష్ణవేణి సహకార బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్,  బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వివాహేతర సంబంధంపై వీరిద్దరికి ఒకరిపై ఒకరికి అనుమానం పెరిగిపోవడంతో తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవలు కాస్త పెరిగిపోవడంతో కోపోద్రిక్తుడైన భర్త  చేతికి దొరికిన క్రికెట్ బ్యాట్‌తో క్రిష్ణవేణి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అమీన్‌పూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.