03-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల్లో నిర్మాణాలకు లంచాలు తీసుకుని ఎన్ఓసీ జారీ చేశారని ఫిర్యాదులు రావడంతో ఇరిగేషన్ హైదరాబాద్ సీఈ ధర్మను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. జంటనగరాల్లో పెద్ద ఎత్తున చెరువుల్లోనే నిర్మాణాలకు సదరు అధికారి అక్రమంగా ఎన్వోసీలు జారీ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ సీఈగా ఉన్న ఆయన సంగారెడ్డి ఇన్చార్జి సీఈగాను పనిచేస్తున్నారు. కాగా రెండు పోస్టుల నుంచి కూడా ధర్మకు ఉద్వాసన పలికారు. బాచుపల్లిలో చెరువులో నిర్మాణం చేపట్టిన ఒక మాల్ కోసం ఇటీవల ఎన్ఓసీ జారీ చేసేందుకు రూ.కోటిన్నర వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. వీటితో పాటు చాలా చెరువుల్లోనూ అక్రమ నిర్మాణాలకు ఎన్ఓసీ ఇవ్వడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నదని తెలుస్తోంది.