calender_icon.png 7 November, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

400 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

07-11-2025 06:46:25 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం మున్సిపల్ చౌదరిగూడ సర్వే నెంబర్ లు 726, 727, 729 లో 400 గజాల పార్కు స్థలాన్ని రియల్టర్ల కబ్జాకి గురైంది. దీంతో  శ్రీనివాస కాలనీ వాసులు హైడ్రాను ఆశ్రయించారు. స్పందించిన హైడ్రా అధికారులు కబ్జాకు గురైన పార్క్ స్థలంలో శుక్రవారం కూల్చివేతలు చేపట్టి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. తమ పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారుల చర్యకు శ్రీనివాస కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.