calender_icon.png 2 July, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజనీకాంత్ కురిపించిన ప్రేమను మర్చిపోలేను

17-06-2025 12:00:00 AM

దిగ్గజ నటులు రజనీకాంత్, మోహన్‌బాబు కలిసి నటించిన ‘పెదరాయుడు’ చిత్రానికి ముప్పు ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. 1995, జూన్ 15న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సినిమా విడుదలై ముప్పు ఏళ్లు అవుతున్న సందర్భంగా చెన్నైలో రజినీకాంత్, మోహన్‌బాబు సందడి చేశారు.

ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కన్నప్ప’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం రజినీకాంత్ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందని విష్ణుని కొనియాడారు. ఈ మేరకు విష్ణు మంచు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. “కన్నప్ప చిత్రాన్ని రజినీకాంత్ గారు ప్రత్యేకంగా వీక్షించారు. తర్వాత నన్ను గట్టిగా హత్తుకున్నారు. ‘కన్నప్ప’ ఎంతో నచ్చిందని అన్నారు.

ఈ క్షణం కోసం నేను 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. నా నటనను ఆయన ఎప్పుడు మెచ్చుకుంటారు.. ఇలా ఎప్పుడు హత్తుకుంటారు.. అని అనుకుంటూ ఉన్నా. ఆ కల ఇప్పుడు నెరవేరింది. నాకు ఈరోజు ఎంతో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా ఉంది’ అన్నారు.

మోహన్‌బాబు స్పందిస్తూ.. ‘జూన్ 15కి ‘పెదరాయుడు’ రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయ్యాయి. అదే రోజు నా ప్రియ మిత్రుడు రజినీకాంత్ ‘కన్నప్ప’ చిత్రాన్ని తన ఫ్యామిలీతో సహా వీక్షించారు. సినిమా చూసిన తర్వాత ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ మిత్రమా” అన్నారు.