31-05-2025 01:15:02 AM
దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, మే 30 : దేవరకొండ మండలంలోని కొండభీమన పల్లి గ్రామ సమీపంలో ఉన్న దొంతినేని సంపతమ్మ ఫంక్షన్ హాల్ లో దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం ముఖాముఖి సమావేశం నిర్వహించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పని చేస్తానని పేర్కొన్నారు.
దేవరకొండ మండలంలోని రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం,వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
పార్టీ కోసం కష్టప ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని అన్నారు.దేవరకొండ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా, పార్టీలకు అతీతంగా పని చేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రతి కార్యకర్తలు ప్రజలందరికీ అందుబాటులో ఉండి,ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తానని అన్నారు.
అనంతరం దేవరకొండ మండలంలోని కొండభీమన పల్లి గ్రామ మాజీ సర్పంచ్ మునుకుంట్ల విద్యావతి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృధ్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై, తెరాస పార్టీని వీడి,కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.