31-05-2025 01:16:30 AM
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
సూర్యాపేట, మే30 (విజయ క్రాంతి) : పి ఆర్ టి యు సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి సంఘం రక్షణ కవచంగా ఉంటుందని శాసనమండలి సభ్యులు పింగిళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోనీ సంఘ కార్యాలయంలో ఇటీవల మరణించిన ఉపాధ్యాయులు లిక్కి రామారావు, గోపాల పోయిన అశోక్ కుమార్ కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సంఘం సంక్షేమ నిధి నుండి చెక్కులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబానికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగ కల్పన ఇప్పించే బాధ్యత తీసుకుంటానని , రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత చికిత్స అందించే హెల్త్ పాలసీని రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ,ఉపాధ్యాయులకు కాంట్రాక్టు సిబ్బందికి అందరికీ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించి ఉత్తర్వులు ఇప్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కాజా ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.