31-05-2025 01:12:32 AM
సూర్యాపేట, మే 30 (విజయక్రాంతి) : ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఐ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉద్యోగస్తులకు ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఉద్యోగస్తులకు హెల్త్ కార్డుల ద్వారా ఉచిత కంటి వైద్యం, సర్జరీలు చేయడం జరుగుతుందన్నారు. ఇట్టి అవకాశాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు వినియోగించుకోవాలన్నారు. ఉద్యోగస్తుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, ఆత్మకూర్ ఎస్, దవాఖాన డాక్టర్ ఉట్కూరు శ్రీధర్ రెడ్డి, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జాన్ రెడ్డి, సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గోదేశి దయాకర్, మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మేకల రాజశేఖర్, దొంగర మహేష్, వివిధ మండలాలకు చెందిన సంఘ నాయకులు పాల్గొన్నారు.