15-06-2025 12:58:38 AM
కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ లో వినతుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఒకటి మంత్రులతో వారా నికోసారి ముఖాముఖి. మరొకటి కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభు త్వం తరపున ప్రజాభవన్లో ప్రజావాణి జరుగుతోంది. అయి తే ఈ మూడు కార్యక్రమాలకు ప్రజలు తమ సమస్యల చిట్టాను తీసుకుని వస్తున్నారు.
కొందరు మూడు చోట్ల మూడు అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇదే విషయంపై పలువురు అర్జీదారులను అడగా, ఏమి చేత్తం సార్.. మూడు రాళ్లు వేస్తే ఏదో ఒక రాయన్న తగలదా..? అంటూ సమాధానం ఇస్తున్నారు. అంటే సమస్యలతో వచ్చిన వాళ్లను కూడా తప్పుగా ఆర్థం చేసుకోవాల్సిన అవస రం లేదు. ఎందుకంటే కొన్నేళ్లుగా తమ సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయాల చు ట్టూ రాష్ట్రంలో వేలాదిగా తిరుగుతున్నారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీనే స్వయంగా అర్జీలు తీసుకుంటుండటంతో.. ఏదో ఒక చోట తమ సమస్యకు పరిష్కారం దొరుకుందనే నమ్మకంతో అన్ని చోట్ల దరఖాస్తులు చేసుకోవడం కనిపిస్తోంది. సుంచు అశోక్