15-06-2025 12:58:25 AM
తెలంగాణలో బీజేపీ దోస్తానా ఏ పార్టీతో అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏమో తమ పార్టీని బీజేపీతో కలిపేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద కలకలమే సృష్టించారు. ఈ ముచ్చటేందో తెలుసుకుందామని కారు పార్టీతో పాటు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఆరా తీస్తుంటే, మొన్న గులాబీ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి కమలం పార్టీ కోసం సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారంటూ ఆరోపించారు.
మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లలో ఏడు సీఎం రేవంత్రెడ్డి చలువే అని సూత్రీకరించారు. ఇక కమలం పార్టీ వాళ్లమో కారు, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్క టే అని అంటుంటారు. మూడు పార్టీల ముచ్చట ఎట్లున్నా, ఈ లెక్కన తెలంగాణలో అసలు కాషాయం పార్టీ అండర్స్టాండింగ్ ఎవరితో అనేది ఇప్పుడు అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న. తమ్మనబోయిన వాసు