calender_icon.png 17 October, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను పోస్టల్ ద్వారా అందించాలి

16-10-2025 05:35:50 PM

రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్టోరల్ అధికారి కార్యాలయం నుండి ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు-కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి మాట్లాడుతూ నూతనంగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు.

ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి వారి వయసును తగిన ఆధారాలతో సమర్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ పవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఓటరుగా నమోదైన వారికి తపాలా శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితాలో 100 సంవత్సరాలు వయసు పైబడిన ఓటర్లను గుర్తించి వారి నిజ వయసు ఆధారంగా సవరించడానికి చర్యలు తీసుకుంటామని, జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో గల బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెండింగ్ లో గల ఫారం 6, 7, 8 దరఖాస్తులు పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకులు శ్యాం లాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.