18-06-2025 12:20:18 AM
శిల్పా లేఔట్ ఫేస్హా ఫ్లైఓవర్ పరిశీలన
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి): శిల్పా లే ఔట్ఫేస్ ఫ్లైఓవర్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధి కారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి వరకు రూ.178 కోట్ల వ్యయంతో చేపట్టిన శిల్పా లే ఔట్ త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మంగళవారం కమిషనర్ పరిశీలించారు.
గచ్చిబౌలి, హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్లు, ఇతర అభివృద్ధి పనులు పరిశీలించి వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాద నలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పా లే ఔట్ ఫేస్ 2 ఫ్లైఓవర్ సుందరీకరణ, గ్రీనరీ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
కమిషనర్ వెంట ప్రాజెక్ట్ సీఈ భాస్కర్రెడ్డి, డిప్యూటీ ఈఈ హరీష్, జోనల్ ఎస్ ఈ శంకర్ నాయక్ ఉన్నారు. అనంతరం హఫీజ్పేట్లో పలు ప్రాంతా లను పరిశీలించారు. ఈ సందర్భంగా హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్ కింద వ్యర్థాలను తొలగించి స్పోరట్స్కు అనుకూలంగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.