15-06-2025 12:57:15 AM
అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కాలం కలిసి రావడం లేదు. ఒక పక్క అధికారం పోయిందనే బాధలో ఉంటే, మరో పక్క స్కాంలు, కేసులు, విచారణ అంటూ దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో దాదాపు అందరూ ఏదో ఒక కేసులో విచారణ ఎదుర్కొక తప్పట్లేదు. లిక్క ర్ కేసులో కవిత విచారణతో మొదలైన ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. లిక్కర్ స్కామ్లో కవిత కొన్ని నెలలపాటు జైల్లో కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో కేటీఆర్, హరీశ్రావు, కేసీఆర్ కూడా పలు కేసుల్లో విచారణకు హాజరయ్యారు.
ఈనెల 9వ తేదీన మాజీమంత్రి హరీశ్ రావు, 11వ తేదీన మాజీసీఎం కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. కాలం కలిసి రాకపోతే ఇలాగే ఉంటుందని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలాఉంటే తాజాగా ఈ రేసింగ్లో విచారణకు హాజరుకావాలని కేటీఆర్కు కూడా పిలుపువచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్ర నాయకులకు దెబ్బ మీద దెబ్బ పడుతోందని ప్రజలు చెవులు కొరుక్కుంటుండగా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను ఇబ్బందులు పెట్టడం అధికారపార్టీలకు కామ నే అని గులాబీ పార్టీ నేతలు సర్దుకొస్తున్నారు. -- క్రాంతి మల్లాడి