20-06-2025 12:00:00 AM
ఎస్పీ మహేష్ బి.గితే
రాజన్న సిరిసిల్ల: జూన్ 19 (విజయక్రాంతి)గురువారం జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
పెండింగ్ లో ఉన్న కేసులలో త్వరగా పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి అని పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని,రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంచాలని , ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలనీ అధికారులను ఆదేశించారు.
నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు పకడ్బందీగా జారీ చేయాలి.ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు.
నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసు విచారణ విజయవంతంగా పూర్తి అయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం వుంటుందిఅన్నారు.జిల్లా వ్యాప్తంగా ముమ్మర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తరుపున ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 06 గంటల నుండి 08 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరుగుతుదని,మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్షలు జరిమనలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో సి.ఐ లు కృష్ణ,మొగిలి,శ్రీనివాస్,వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.