21-06-2025 12:00:00 AM
చెరువులో దూకి తల్లీ, కూతుళ్ల బలవన్మరణం
నిర్మల్ జూన్ 30 (విజయ క్రాంతి) : నిర్మల్ పట్టణంలోని బంగల్పెట్ కాలానికి చెందిన తల్లి కూతురు శుక్రవారం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బలవనస్మరణానికి పాల్పడ్డ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిం ది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ పట్టణంలోని బంగల్పెట్ కాలనీకి చెందిన సుంకరి లక్ష్మీబాయి 80) , సుంకరి గౌరమ్మ (50) తల్లి కూతుర్లు ఒకే ఇంటిలో కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు.
వీరిద్దరూ తరచుగా అనారోగ్యానికి గురై వివిధ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్నప్పటికీ జబ్బు నయం కాకపోవడంతో రోజురోజుకు మానసిక వేదనకు గురవుతున్నారు. అనారోగ్యం తో ఉన్న తాము ఎవరికి భారం కాకూడదన్న ఉద్దేశంతో శుక్రవారం ఇంటి నుంచి బంగల్పేట చెరువులోకి వద్దకు వెళ్లిన వెళ్లారు. తల్లి కూతుర్లు చెరువు కట్టపై ఉన్న తూము వద్ద నీటిలో దూకడంతో ఇద్దరు మునిగిపోయా రు.
ఉదయం 8 అయిన లక్ష్మీబాయి గౌరమ్మ ఇంటి బయటకు రాకపోవడం ఇం టి తలుపులు తెరిచి ఉండడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్ళగా వారు ఇంట్లో లేకపోవడంతో చుట్టుపక్కల తోటి బంధువులతో కలిసి వెతికారు. 11 గంటలకు ప్రాంతాల్లో బంగల్పేట చెరువులో మృతదేహాలు కనిపించడంతో పోలీ సులకు సమాచారం ఇచ్చారు ఘటన జరిగిన పోలీసులు మృతదేహాలను బయటకు తీసి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.