calender_icon.png 27 July, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో అపార అవకాశాలు

25-07-2025 12:48:42 AM

  1. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
  2.    3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
  3. సాధనలో ప్రభుత్వంతో భాగస్వాములు కావాలి
  4.    18 నెలల్లో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టబడులు 
  5. యూఏఈ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ రంగంలో రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలు పంచుకొని భాగస్వాములు కావాలని యూఏఈ పారిశ్రామి కవేత్తలను మంత్రి కోరారు.

గురువారం హెఐసీసీలో యూఏఈ, రాష్ర్ట ప్రభుత్వం సం యుక్తంగా ‘ఇన్వెస్టోపియా గ్లోబల్’ పేరిట నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లా డుతూ.. భౌగోళికంగా చిన్నదైనా, ఆశయా లు, ఆచరణలో మాత్రం తెలంగాణ చాలా పెద్దదని, స్వల్ప కాలంలోనే ఫీనిక్స్ పక్షిలా ఎదిగి ఇతర రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమం లో ఆదర్శంగా నిలిచిందన్నారు. 2024-25 లో జీఎస్‌డీపీలో 8.2 శాతం వృద్ధి నమోదైం దని, ఇది జాతీయ సగటు(7.6%) కంటే ఎ క్కువ అని వివరించారు. దేశ జీడీపీలో తెలం గాణ వాటా 5 శాతానికి పైగా ఉందని తెలి పారు.

రాష్ర్టంలో డ్రైపోర్ట్‌లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, పారిశ్రామిక కారిడార్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని, నెట్- జీరో పారిశ్రామిక పార్కులు, ఈవీ జోన్లు, గ్రీన్ లాజిస్టిక్స్ హబ్‌లు, రీజినల్ రిం గ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), మెట్రో ఫేజ్ తది తరాలు పారిశ్రామికాభివృద్ధికి మరింత ప్రో త్సాహం ఇవ్వనున్నాయని పేర్కొన్నారు. అం తర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయ బోతున్న ఫ్యూచర్ సిటీ ఫిన్‌టెక్, క్లుమైట్-టెక్, స్మార్ట్ మొబిలిటీ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మారబోతుందని చెప్పారు.

డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు(జీ సీసీ), ఏఐ ల్యాబ్‌లు, ఏరోస్పేస్ క్లస్టర్లలో వేగవంతమైన వృద్ధి నమోదవుతోందని పేర్కొన్నారు. 18 నెలల్లో తెలంగాణ కొత్తగా రూ.3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని, 2024-25 ఆర్థిక సంవ త్సరంలో యూఏఈకి తెలంగాణ ఎగుమ తులు 2.5 రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఫార్మా, ఏరోస్పేస్, డిజిటల్ సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్ కీలక పాత్ర పోషించాయని, ఇప్ప టికే యూఏఈకి చెందిన లూలూ గ్రూప్, డీపీ వరల్డ్, నాఫ్కో వంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయని తెలిపారు.

ఇది ఒక పెట్టుబడి సదస్సు మాత్రమే కాదని, పాత స్నేహితుల కలయిక, భవిష్యత్తుకు ఒక లాం ప్యాడ్ అని తెలిపారు. యూఏఈ లాగే, తె లంగాణ కూడా సమయం, నమ్మకం, పరి వర్తనకు విలువ ఇస్తుందని, ఇక్కడ ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సెన్సైస్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, లాజి స్టిక్స్, వేర్‌హౌసింగ్, ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్ర క్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఎగుమతులు, ఏరో స్పేస్, డిఫెన్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ మొబిలిటీ, పర్యాటకం, వెల్‌నెస్, మెడి కల్ తదితర రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావా లని యూఏఈ పారిశ్రామికవేత్తలకు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో యూఏఈ మినిస్ట ర్ ఆఫ్ ఎకానమీ, టూరిజం అబ్దుల్లా బిన్ తాక్ అల్ మర్రి, రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, టీజీఐఐసీ ఎండీ కే శశాంక, అండర్ సెక్రటరీ ఆఫ్ ది యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ మహ్మద్ అల్వాహీ, యూఏఐ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ వాలిద్ హరేబ్ అల్ ఫలాహి, ఇన్వెస్టోపియా సీఈవో డా జీన్ ఫారెస్ తదితరులు పాల్గొన్నారు.