calender_icon.png 3 January, 2026 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోచుకోవడం.. దాచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఒక్కటే..

03-01-2026 12:00:00 AM

బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్

హనుమకొండ, జనవరి 2 (విజయ క్రాంతి): దోచుకోవడం దాచుకోవడంలో రెండు పార్టీలు ఒక్కటే అని ఆనాడు టిఆర్‌ఎస్ పార్టీ దోచుకుని దాచుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది అని బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే  ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం హన్మకొండ హంటర్ రోడ్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే  ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్  మాట్లాడుతు గతంలో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు  రాష్ట్రంలో గెలుపొందిన సర్పంచ్లందరూ టిఆర్‌ఎస్ పార్టీ వారేనని, ఇప్పుడు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులందరూ కాంగ్రెస్ పార్టీ వారే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు.

కానీ వాస్తవంగా గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నది శూన్యం అని, గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు మరియు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వార జరుగుతుంది అని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిషన్ల పై తప్పితే అభివృద్ధిపై ఎటువంటి ఆలోచన లేదు అని, కేవలం ప్రజల ముందు రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారన్నారు.కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటే అని వీరిద్దరిని కలుపుతున్నది రాహుల్ గాంధీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్లు, కమిషన్లు, కాంట్రాక్టులు అని విమర్శించారు.

ఈ సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ , బిజెపి జిల్లా నాయకులు ఆర్.పి.జయంత్ లాల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, సండ్ర మధు, కేతిపల్లి సంపత్ రెడ్డి, కురిమిండ్ల సదానందం, అరణ్య రెడ్డి, మల్లికార్జున్, అభిషేక్, తదితరులు పాల్గొన్నారు.