10 March, 2026 | 9:58 PM

పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి

09-03-2026 01:53 AM

కాగజ్‌నగర్,  మార్చి 8 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కాగజ్‌నగర్ పట్టణం లోని అంబేద్కర్ చౌక్ ఎదుట ప్లే కార్డులతో ఆందోళన చేపట్టారు. గృహ వినియోగ గ్యాస్‌పై రూ.60, కమర్షియల్ గ్యాస్‌పై రూ.115 పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కూషణ రాజన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాల కారణంగానే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం, దినకర్, జిల్లా కమిటీ సభ్యులు టికానంద్, నాయకులు కృష్ణమాచారి, సుధాకర్, రవి, రాజేందర్, ముంజం, హానీషా తదితరులు పాల్గొన్నారు.