27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

09-03-2026 01:52 AM

నిర్మల్, మార్చి 8 (విజయక్రాంతి): విద్యా వ్యవస్థలో నిర్మల్ పట్టణంలో ఉన్నతమైన హంగులతో పాఠశాలలు ఉన్నాయని ప్రతి ఒక్కరు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ద చూపాలని మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య సూచించారు.  నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె ప్రారంభించారు.

పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రదర్శన, వైద్యాశిభిరం, మహిళల ఏర్పాటు చేసిన క్రీడలను సందర్శించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, డాక్టర్‌లతో కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సెల్ఫీలు దిగి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వినీశ, రేజొనేన్స్ ప్రిన్సిపాల్ లావణ్య,  వాసవి పాఠశాల నిర్వాహకులకు ముత్యం రెడ్డి, జగదీశ్ రెడ్డి, పోతారెడ్డి పాల్గొన్నారు.