20 August, 2026 | 1:03 AM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

27-06-2026 05:45 PM

ముదిగొండ,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామపంచాయతీకి సంబంధించినకర్ని వీరబాబు ఇంటికి పర్మిషన్ ఇవ్వడానికి 50 వేలు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రెటరీ సురేష్. చివరకు 25 వేలు ఒప్పందం కుదిరింది. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని వీరబాబు ఏసీబీ అధికారులను సంప్రదించగా ఈరోజు 25 వేల రూపాయల లంచమును సెక్రెటరీ సురేష్  తీసుకొనుచుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు సురేష్ ను అదుపులో  తీసుకున్నట్లు సమాచారం..