అబ్బాయిల పరాజయం

02-05-2024 12:44:30 AM

చెంగ్డూ (చైనా): ప్రతిష్ఠాత్మక థామస్‌కప్‌లో ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్ చేరిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు.. చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గ్రూప్ భాగంగా మంగళవారం జరిగిన టైలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 1 14సార్లు చాంపియన్ ఇండోనేషియా చేతిలో ఓడి గ్రూప్ దశను రెండో స్థానంలో ముగించింది. మొదట పురుషుల సింగిల్స్ పోరులో హెచ్‌ఎస్ ప్రణయ్ 13 21 21 ఆంటోని గింటింగ్‌పై విజయం సాధించి జట్టుకు శుభరాంభాన్ని ఇచ్చినా.. ఆ తర్వాత మన షట్లర్లు అదే జోరు కొనసాగించలేకపోయారు. తొలి పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ శెట్టి జంట 22 24 19 మౌలానా జోడీ చేతిలో ఓడింది. రెండో సింగిల్స్ పోరులో లక్ష్యసేన్, రెండో డబుల్స్‌లో ధ్రువ్ జంట ప్రభావం చూపలేకపోగా.. చివరిగా జరిగిన మూడో సింగిల్స్‌లో శ్రీకాంత్ కూడా ఓటమి పాలయ్యాడు.