కంగారూల సైన్యమిదే
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు చుక్కెదురైంది. వచ్చే నెలలో వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతడిని ఎంపిక చేయలేదు. మెగటోర్నీ కోసం సీఏ మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్కు ఆల్రౌండర్ మిషెల్ మార్ష్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. స్మిత్తో పాటు ఐపీఎల్లో దంచికొడుతున్న యువ సంచలనం జేక్ ఫ్రెజర్ మెక్గుర్క్ను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చిన్నారులతో తమ వరల్డ్కప్ జట్టును ప్రకటించగా.. ఆస్ట్రేలియా బోర్డు మరో అడుగు ముందుకు వేసి 2007 వన్డే ప్రపంచకప్ నెగ్గిన ఆసీస్ ప్లేయర్లతో ఒక్కో ఆటగాడి పేరును రివీల్ చేసింది. ఆ జట్టులో సభ్యుడైన ఆల్రౌండర్ సైమండ్స్ మృతిచెందడంతో అతడి కుటుంబ సభ్యులకు ఆ బాధ్యత అప్పగించి ఆకట్టుకుంది.