calender_icon.png 20 January, 2026 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థిక-సామాజిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

20-01-2026 02:26:16 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా..మంగళవారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని కందర్‌పల్లి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక-సామాజిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి మున్సిపల్ కమిషనర్ షేక్ హయుమ్, తహసీల్దార్  స్థానిక మండల నాయకులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.