17-06-2025 05:29:37 PM
సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య..
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య(CPM Mandal Secretary Yerpula Yadaiah) అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో మంగళవారం చెల్లం ముత్యాలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదల కలలు నెరవేరాలంటే ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇండ్లు ఇవ్వాలని ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్మికులు కర్షకులు, మేధావులు, ఉపాధ్యాయులు యువత మహిళలు అందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, 11న కేంద్ర కార్మిక సంఘాలు యుద్ధానికి రాజ్యాంగంలో రాసుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చే విధానాన్ని వెనక్కి తీసుకొని, కార్మిక వర్గానికి కనీస వేతనం రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత 8 గంటల పని విధానం అమలు చేయాలని యావత్ కార్మికులు సిద్ధమవుతున్నారని తెలిపారు. సమ్మెను సీఐటీయు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు నీలకంఠం రాములు, కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, సల్వోజ్ రామలింగాచారి, దామెర లక్ష్మి, ఆయిల్ కృష్ణయ్య, ఏరుకొండ రాఘవేంద్ర, నీలకంఠం యాదమ్మ, కాసం విజయలక్ష్మి, మాడుగుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.