13-06-2025 12:55:22 AM
ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర జూన్ 12 : ఇల్లు లేని వారికి సొంత ఇల్లు నిర్మించుకునేందుకుగాను ఇందిరమ్మ ఇ ల్లు మంజూరు చేయడం జరుగుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశా రు. గురువారం నియోజకవర్గ కేంద్రంలో దేవరకద్ర మున్సిపాలిటీ & మండలంకు చెందిన వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు (దేవరకద్ర మండలం 330 మందికి, మునుపు మినిగొనిపల్లి గ్రామంలో 80 మందికి, దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో 40 మందికి) ప్రొసీడింగ్స్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ ఇండ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని అన్నారు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు, మిత్తిలు కట్టుకుంటూనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందన్నారు, గత బిఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల దౌర్భాగ్య, చేతకాని మాజీ ఎమ్మెల్యే పాలనలో దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూ డా నిర్మించలేదని గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి మేలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులుఉన్నారు.