13-06-2025 12:53:53 AM
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్ కుమార్
గద్వాల, జూన్ 12 (విజయక్రాంతి): జిల్లాలో రెండు దశబ్దాలు నుండి కంపినీలు, ఆర్గనైజేర్ల దాదాపు 40 వేల ఎకరాల సీడ్ను లీడర్లు, రాజకీయ నా యకుల ముసుగులో ఫెల్ కాకపోయి నా ఫెల్ అనీ ఇస్తూ రైతులను మో సం చేస్తున్నారని బిఆర్ ఎస్ రాష్ట్ర నా యకుడు డా కుర్వ విజయ్ కుమార్అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు.
సీడ్ వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారన్న విషయం పై ఇటీవల . కలెక్టర్ ని కలవడంతో పాటు హైదరాబాద్లో . రైతు కమిషన్ సభ్యుడు గోవింద్ రె డ్డికీ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు దృష్టికి గద్వాల జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న ఇబ్బందుల గురుంచి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.
1966 యాక్ట్ ప్రకారం రైతులకు అన్యాయం జరిగితే ఈ చట్టం ద్వారా కఠినమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉందని రైతు కమిషన్ అధ్యక్షులు తెలపడం జరిగిందన్నారు.శుక్రవారం రైతు కమిషన్ జిల్లాకు రాబోతుందని అందుకు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాటమన్నారు. ఈ మేరకు సీడ్ రైతులు బాధితులు రైతు కమిషన్ ఎదుట పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు.