5 May, 2026 | 10:43 AM

సమాచారం మన ప్రాథమిక హక్కు

28-05-2024 12:05 AM

మన సమాచార చట్టం  ప్రాథమిక హక్కు చట్టం. ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉందా. ఫిబ్రవరి 15న, అత్యున్నత న్యాయస్థానం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అనామక ఎలక్టోరల్ బాం డ్లు సమాచార హక్కు, ఆర్టికల్ 19(1) (ఎ)ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. రూలింగ్‌లో భాగంగా 2019 ఏప్రిల్ 12 నుండి కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాం డ్ల వివరాలను మార్చి 6లోగా భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని జారీ చేసే బ్యాంక్ ఎస్‌బీఐని ఆదేశిస్తే అర్థం కాలేదా. అయితే ఎస్‌బీఐ జూన్ 30 వరకు పొడిగింపును కోరుతూ మరో దరఖాస్తును దాఖ లు చేసింది. అంటే ఇంకా కొనసాగించి ఇంకా ఆలస్యం చేయడమేనా మనం చేయవలసిన పని? ఈ సంవత్సరం జరగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత - ఈ బాండ్ల విక్రయం నుండి ’డీకోడింగ్ కంపైలింగ్ డేటా సంక్లిష్టత’ అని పేర్కొంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీ ఆర్), కామన్ కాజ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌తో పాటు ఎస్‌బీఐ  పొడిగింపు పిటిష న్‌ను విచారించిన  చీఫ్ జస్టిస్ డీ వైచంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన  ధర్మాసనం అనేక ప్రశ్నలు వేసింది. (మార్క్సిస్ట్) బాండ్లకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించనందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుకు వ్యతిరేకంగా, లైవ్‌లా నివేదించింది. 

బాండ్లట, విముక్తి అట

దాత వివరాలు, దాతలు అమ్ముకున్నవారా, లంచాలు ఇచ్చినవారా, లంచాలు రాసుకున్న వారా? బాండ్ల విముక్తి, విముక్తి అంటే అర్థం చేసుకుంటున్నాం. వేర్వేరు సమాచార రహస్యాల్లో భద్రపరిచారని, మ్యాచింగ్ ప్రక్రియ సంక్లిష్టత కారణంగా జాప్యం జరుగుతోందని ఎస్‌బీఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తెలిపారు. ఇదేం న్యాయ ప్రక్రియ. ఇది న్యాయవాదం, ఇదే న్యాయం? దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకు ‘మ్యాచింగ్ ఎక్సర్‌సైజ్’ నిర్వహించాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారాన్ని వెల్లడించాలని ఆదేశించారు. ప్రధాన న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు. బ్యాంకు వద్ద అవసరమైన అన్ని వివరాలు ఉన్నాయని, దాని కేవైసీ రికార్డుల ద్వారా రుజువు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఏయే బాండ్లు ఏ పార్టీలకు వెళ్లాయో ఎస్‌బీఐ వెల్లడించాల్సిన అవసరం లేదని ఇది సూచిస్తోంది. 

ఎస్‌బీఐ మౌనం, దారుణమైన ప్రశ్నలు

తీర్పు వెలువడి 26 రోజులైనా పురోగతిపై ఎస్‌బీఐ మౌనం వహించడాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. పురోగతికి సం బంధించిన వివరాలను అఫిడవిట్‌లో నమోదు చేస్తామని సాల్వే కోర్టుకు హామీ ఇచ్చారు. ‘మా తీర్పు ఫిబ్రవరి 15న వెలువడింది. ఈరోజు, అది మార్చి 11. గత 26 రోజులలో, మీరు చేసిన మ్యాచింగ్ ఏ మేరకు ఉంది? దీనిపై అఫిడవిట్ మౌనం గా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంత మేర నిస్సందేహంగా మేం ఆశిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు వివరించవలసి వచ్చింది.

ఆయన ఒక ప్రముఖ న్యాయవాది ఈ విధంగా అంటున్నారు. ’మా వద్ద వివరా లు ఉన్నాయి, అవి మా వద్ద లేవని నేను చెప్పడం లేదు అని సాల్వే గారు కోర్టుకు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదు చేసిన సమాచారం సైలైజేషన్ కారణంగా ఈ ఇబ్బంది ఏర్పడిందని పునరుద్ఘాటించే ముందు ‘ఇది రహస్యంగా ఉండాలని మాకు చెప్పబడింది. ఆ విధం గా మేము యంత్రాంగాన్ని రూపొందించాము. మేము ఇప్పుడు ఏదైనా తప్పు చేయడం ద్వారా ఎలాంటి విధ్వంసం సృష్టించాలనుకోవడం లేదు... ’అని సాల్వే వాదించారు.

న్యాయం బతికింది

న్యాయవాదులు తను సొంతంగా ఏమీ చెప్పరు, ఎస్‌బీఐ వంటి వాళ్లు కొన్ని మాట లు చెప్పిస్తారు, అవే సుప్రీంకోర్టులో కూడా చెబుతున్నారు. దానికి బాధ్యత న్యా యవాదులకు ఉండదు. కానీ ఇటువంటి మాటలు చెప్పినప్పుడు బ్యాంకుకు బాధ్యత ఉండదా. అయితే, జస్టిస్ ఖన్నా మాట్లాడు తూ ‘ఎలాంటి పొరపాటు ప్రశ్న లేదు. మీ కు కేవైసీ ఉంది. దేశంలోనే నంబర్ 1 బ్యాంక్ మీరే. మీరు దీన్ని నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాం’ అని మర్యాదగా చెప్పారు.

కొనుగోలు వివరాలను ప్రధాన శాఖ లో సీల్డ్ కవర్లో ఉంచినట్లు బ్యాంక్ తన పిటిషన్‌లో  సూచించింది. అప్పుడు జస్టిస్ ఖన్నా ఈ అంశాన్ని, ఈ వాదాన్ని ఎత్తి చూ పుతూ, సీల్డ్ కవర్‌ను తెరిచి, పేర్లను క్రోడీకరించి, వివరాలను అందించండి అని అని స్పష్టంగా ఆదేశించాల్సి వచ్చింది.ఎస్‌బీఐనుండి కోరిన వివరాలలో ప్రతి ఎల క్టోరల్ బాండ్ కొనుగోలు తేదీ, కొనుగోలుదారు పేరు, వారి డినామినేషన్ వివరంగా చెప్పారు. అదనంగా, రాజకీయ పార్టీలు క్యాష్ చేసిన బాండ్ల వివరాలు, అటువంటి  ఎన్‌క్యాష్‌మెంట్ తేదీతో సహా కూడా అవసరం. న్యాయస్థానం, తన తుది ఉత్త ర్వుల్లో,‘ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాత ల వివరాలు రిడీమ్ అంటే విముక్తి వివరాలు వేర్వేరు ఖాతాలో ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్నాయని సమర్పించింది.

మరో మాటలో చెప్పాలంటే, ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం బ్యాంక్ తన వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుంది. భారత ఎన్నికల కమిషన్‌కు సంబంధించి, సమాచారాన్ని సంకలనం చేయాలని సమాచారాన్ని వారి వెబ్‌సైట్‌లో మార్చి 15, 2024 సాయం త్రం 5 గంటలలోపు ప్రచురించాలని మేము వారిని ఆదేశిస్తున్నాం’ అని వివరించారు. గత ఏడాది నవంబర్‌లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా కోర్టుకు అందించిన సమాచార వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఈసీని ధర్మాసనం కోరింది. ఆ క్రమంలో సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అన్ని రాజకీయ పార్టీలు స్వీకరించిన నిధుల వివరాలను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని కోర్టు ఈసీని కోరింది. 

ధిక్కారం

సుప్రీంకోర్ట్ ఎస్‌బీఐ కోసం కొత్త మార్చి 12 గడువు గురించి అడిగినప్పుడు,ఈసీఐ ప్రతినిధి ‘నో కామెంట్స్’ అని వదిలిపోతారా.  ధిక్కార పిటిషన్‌పై ఎస్‌బీఐకి వ్యతిరేకంగా ధిక్కార చర్యలను ప్రారంభించడానికి నిరాకరిస్తూ, తాజా ఆదేశాలను పాటించని సందర్భంలో ఉద్దేశపూర్వకంగా దాని ఆదేశాన్ని ఉల్లంఘిం చినందుకు దానిపై కొనసాగడానికి మొగ్గు చూపుతామని కోర్టు పేర్కొంది.‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపైన జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా దాని చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ గారు అఫిడ విట్‌ను దాఖలు చేస్తున్నారని అంటున్నారు. ఇది కోర్టు ధిక్కారమే కదా, లేదా?

మేము ఈ సమయంలో ధిక్కార అధికార పరిధిని అమలు చేయడానికి అనుకూలంగా ఉన్నారా లేదా, ఈ క్రమంలో సూచించిన సమయపాలనకు అనుగుణంగా లేకుంటే ఉద్దేశపూర్వక అవిధేయత కోసం ఈ కోర్టు దానిపై  చర్యలు తీసుకుంటామని మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులో పేర్కొన్నాం’ అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. మార్చి 7న ఏడీఆర్ ,కామన్‌కాజ్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మార్చి 11న విచారణకు రానున్న ఎస్‌బిఐ పొడిగింపు పిటిషన్‌తో జాబితా చేయాలని కోర్టును కోరుతూ వారి ధిక్కార పిటిషన్‌పై అత్యవసర విచారణను అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌లో ఎస్‌బీఐ ఉద్దేశపూర్వక ధిక్కారాన్ని ఆరోపించింది, అంతేకాదు బ్యాంక్‌పై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరింది. గడువు పొడిగింపు కోసం బ్యాంక్ చేసిన అభ్యర్థన ’మంచిది’ కాదని అంటూ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు పారదర్శకత ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నమని పిటిషనర్లు వాదించారు, ‘లైవ్‌లా’ నివేదించింది.ఈ బాండ్లను నిర్వ హించడానికి కొన్ని నియమాలు రూపొందించారు. బ్యాంక్ అధునాతన ఐటీ వ్యవస్థను నిర్మించారట. పిటిషనర్లు ఎస్‌బీఐ ఇప్పటికే కలిగి ఉన్న సమాచారాన్ని త్వరగా కంపైల్ చేసి బహిర్గతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని వాదించారు. దీంతో సీపీఐ (ఎం) కూడా మార్చి 8న ఎస్‌బీఐపై ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. 

ఈ ఎలక్టోరల్ బాండ్‌ని ఆర్థిక స్కీం అంటారు. నిజంగా ఇది దోచుకోవడం, తర్వాత దాచుకోవడమా? ఇదీ ఆర్థిక స్కీమ్. 2018లో ప్రారంభించారు. ఇక్కడ ఎలక్టోరల్ బాండ్లను వ్యక్తులు లేదా కంపెనీలు బ్యాంకుల నుండి కొనుగోలు చేసే సాధనంగా  వాడుకుంటారు, వీటిని రాజకీయ పార్టీకి సమర్పించవచ్చు, వాడుకుం టారు నిధులు అంటారు విరాళాలు అం టారు. వాటిని రీడీమ్ చేయగలుగుతారు. 

అందమైన పేరు, అది స్కీం అట?

రాజకీయ నిధులకు పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని బాండ్ల స్కీమ్ అంటారు. నిజానికి డబ్బులు వసూలు చేస్తుంటారు అంతే.

పథకంలోని నిబంధనల ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29 కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు, లోక్‌సభకు లేదా రాష్ట్ర శాసనసభకు గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించినవి మాత్రమే  ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించడానికి అర్హులు.