11-06-2025 10:34:19 PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ రేణికుంట్ల ప్రవీణ్..
హనుమకొండ (విజయక్రాంతి): టీపీసీసీ నియామకాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy)కి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రేణుకుంట్ల ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎత్తిన జెండా దించకుండా, 10 సంవత్సరాల బి.ఆర్.ఎస్ పాలనను వరంగల్ జిల్లాలో దీటుగా ఎదుర్కొని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలుస్తూ, ఎన్ని కేసులు పెట్టినా అదరకుండా, బెదరకుండా కాంగ్రెస్ వాదాన్ని బలంగా ఉమ్మడి జిల్లాల్లో వినిపించిన నాయిని రాజేందర్ రెడ్డి అని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా ఉమ్మడి ప్రజల డిమాండ్ మేరకు పిసిసి, ఏఐసిసి నేతలు పునరాలోచించి నాయిని రాజేందర్ రెడ్డికి 30 సంవత్సరాల రాజకీయ అనుభవం, త్యాగాలకు గుర్తింపుగా వారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా క్యాబినెట్ హోదా కలిగిన ఏదైనా ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని డాక్టర్ రేణికుంట్ల ప్రవీణ్ డిమాండ్ చేశారు.