28 June, 2026 | 2:04 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

కామారెడ్డి లో ఐస్ క్రీమ్ పార్లర్, జ్యూస్ కేంద్రాల తనిఖీ

10-04-2025 05:12 PM

తనిఖీలు చేపట్టిన ఆహార భద్రతశాఖ అధికారులు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఐస్ క్రీం పార్లర్స్, జ్యూస్ కేంద్రాలను ఆహార భద్రత అధికారులు డా.శిరీష, సునీత లు గురువారం తనిఖీలు చేపట్టారు. తనిఖీ సమయంలో కొన్ని గడువు ముగిసిన ఆహార పదార్ధాలు లభించాయి. వాటిని వెంటనే పార వేయించారు. ఐస్ క్రీం, జ్యూస్ తయారీ ప్రాంతంలో పరిశుభ్రత లేని కారణంగా వారికి నోటీసులు జారి చేశారు. ఆహార పదార్థాల విక్రయాలు చేపట్టే  నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఆహార భద్ర తా పదార్థాల వద్ద పరిశుభ్రత మీద అవగాహన కల్పించారు. అపరిశుభ్రంగా ఉంచుకుంటే కేసులు నమోదు చేసి దుకాణాలను సిల్ చేస్తామని హెచ్చరించారు.