29-05-2025 02:47:06 AM
గద్వాల, మే 28 ( విజయక్రాంతి ) : సేకరించిన వరి ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరగేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు.
బుధవారం గద్వాల మండల కేంద్రంలోని గుర్రం గడ్డ ద్వీప గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి, మిగిలి ఉన్న ధాన్యం 17 శాతం తేమ రాగానే కాంటా వేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
ధాన్యం కాంటా వేసిన బస్తాలను మిల్లులకు ఎప్పటికప్పుడు వేగవంతంగా మిల్లులకు తరలించాలని సూచించారు. వరి ధాన్యానికి త్వరితంగా చెల్లింపుల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, ఏపీ డి నరసింహులు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.