20 July, 2026 | 6:52 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

మల్లారెడ్డి యూనివర్సిటీలో తనిఖీలు

20-07-2026 12:24 AM

మేడ్చల్, జూలై 19(విజయ క్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కి చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీలో జేఎన్టీయూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రైవేటు యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో తనిఖీలు నిర్వహించి ఈనెల 24 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

దీంతో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం తనిఖీలు చేపట్టింది. అధికారుల బృందం ల్యాబులు, తరగతి గదులు ఉన్నాయా, ఏ ఐ సి టి ఈ అనుమతి లేకుండా సీట్లు పెంచారా, ఏ ఐ సి టి ఈ కి ఇచ్చిన సమాచారం నిజమేనా, ఫీజు బకాయి ఉందని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆపడం వంటివి చేశారా పరిశీలించింది. అంతేగాక అక్రమ నిర్మాణాలు, శిఖరం భూముల కబ్జా వంటివి కూడా పరిశీలించింది.