20 March, 2026 | 6:53 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

సికింద్రాబాద్‌లో అధికారుల తనిఖీలు

11-07-2024 02:25 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ ‘వివాహ భోజనంభు’ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో కాలం చెల్లిన పదార్థాలు, సరిగా లేబుల్ లేని ప్యాకింగ్‌లతో పాటు సింథటిక్ ఫుడ్ కలర్ పూసిన కొబ్బరి తురుమును అధికారులు కనుగొన్నారు. ఈ రెస్టారెంట్‌లో చిట్టి ముత్యాలు 25 కిలోల బియ్యం బస్తాకు 2022 నాటికే బెస్ట్ బిఫోర్ డేట్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. స్టీల్ కంటైనర్‌లలో నిల్వ చేసిన ముడి ఆహార వస్తువులు, పాక్షిక్షంగా తయారు చేసిన ఆహారాలతో కవర్ చేయబడిన, సరిగా లేబుల్ చేయని వస్తువులను కనుగొన్నారు. డస్ట్‌బిన్లకు సరిగా మూతల్లేకపోవడం, వంట గది ఆవరణ పరిశుభ్రంగా లేకపోవడం, వంట గది ఆవరణలో ఉన్న కాలువలో నిల్వ ఉన్న నీటిని గమనించారు. రెస్టారెంట్‌కు మెడికల్ ఫిట్‌నెస్ సర్టి ఫికెట్ కూడా లేదని గుర్తించారు.