20 March, 2026 | 5:19 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం

11-07-2024 02:26 AM
  1. ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకం, 10 మొబైల్ ఫుడ్ ల్యాబ్‌ల ఏర్పాటు
  2. కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని.. తమ సర్కార్ ఆ ల్యాబ్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుక తిరిగే చట్నీలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

గత పాలనలో రాష్ట్రంలో నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను ప్రక్షాళన చేసి సమూల మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. కొత్తగా రాష్ట్రంలో 17మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించి రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ల్యాబ్స్ ద్వారా రోజుకు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. కొత్తగా 10 మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. స్ట్రీట్ వెండర్లు సైతం ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లను సైతం ఇకపై నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు. ఆహార కల్తీకి పాల్పడే సంస్థల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.