10-10-2025 01:40:20 AM
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : అమెరికా పెంచిన సుంకాలు, హెచ్-1బీ వీసాలపై వి ధించిన కఠిన నిబంధనలు లాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంతోపాటు అస్థిరతకు, అపార్థానికి దారి తీస్తాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అమెరికా నిర్ణయాలు, అనుసరించే విధానాలు సానుకూల దృక్పథంతో, అమెరికా మధ్య సంబంధాలను మరిం త పెంపొందించేలా ఉండాలని అన్నారు.
అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్కు చెందిన 16 మంది ప్రతినిధుల బృందం ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో భారత్లోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సం బంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఈ బృందంలో వివిధ రంగాలకు చెందిన మేధావు లు, బిజినెస్ లీడర్లు ఉన్నారు.
ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్కు వచ్చిన అమెరికా బృందం ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో సీ ఎం రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ స మావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ ప్రపంచ నగరంగా అదరినీ ఆకర్షిస్తోందని, దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీ పడుతోందని వివరించారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని, 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హైదరాబాద్లో గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు చేపడుతున్నామని సీఎం అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతోపాటు రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్, మాన్యుఫ్యాక్చర్ జోన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
డ్రైపోర్ట్ ఏర్పాటుచేసి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే, రైల్ కనెక్టివిటీ ఉండేలా రవాణా సదుపాయాలను విస్తరిస్తుస్తున్నట్టు సీ ఎం వివరించారు. హైదరాబాద్ నుంచి ఇటు చెన్నై వరకు.. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు బుల్లెట్ ట్రెయిన్ ఏర్పాటుచేసే ప్రతి పాదనలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని, సిటీలో ఇప్పుడున్న మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు చెప్పారు.
ఫ్యూచర్ సిటీలో అమెరికా భాగస్వామ్యానికి ఆహ్వానం
30 వేల ఎకరాల్లో హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్ధతును ఆహ్వానిస్తున్నా మని సీఎం తెలిపారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని, మొత్తం 500 కంపెనీలు పెట్టుబడులకు ముందకు రావాలని, ఫ్యూచర్సిటీలో పాలుపంచుకోవాలనే ఆకాంక్షను సీఎం వ్యక్తంచేశారు. ‘చైనా ప్లస్ 1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్లో ఏఐ సిటీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసే ఆలోచనలు ఉన్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వివరించారు. ఏఐ రం గంలో రాష్ట్రాన్ని దేశానికే స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఇప్పటికే పేరొందిన కంపెనీలు హైదరాబాద్లో గ్లోబ ల్ కెపాబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయ ని, వీటిని గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సా హం అందిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.