17 April, 2026 | 11:53 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

ఇంటర్ పరీక్షలు సాఫీగా జరగాలి

28-02-2026 02:08 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఫిబ్రవరి 27(విజయ క్రాంతి) :ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగున్న పరీక్షలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

త్రాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.

 మూడవ రోజు ప్రశాంతంగా మొదటి సంవత్సర పరీక్షలు: -ఇంటర్మీడియట్ విద్యాధికారి- మాధవి 

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఇంగ్లీష్ పరీక్షలు జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసాయి. మొదటి సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగంలో 5877 గాను 5716 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 608 గాను 589 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు.

జిల్లాలో మూడవ రోజు హాజరు శాతం 97.25 శాతం గా నమోదైంది. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పర్యవేక్షించారు.