13 March, 2026 | 4:11 AM

నేటితో ముగియనున్న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు

13-03-2026 01:27 AM

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. గురువారం కెమిస్ట్రీ, కామర్స్ చివరి పరీక్షలు జరిగాయి. శుక్రవారంతో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ముగుస్తాయి. మార్చి 14న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 17న జాగ్రఫీ ఉన్నా వాటికి కొద్దిమంది విద్యార్థులు మాత్రమే హాజరవుతారు. మొత్తం పరీక్షలు మార్చి 18న పూర్తవుతాయి.

పరీక్షల ఫీజు చెల్లించకపోవడంతో గత నెల లో దాదాపు 200 మంది విద్యార్థులను ప్రా క్టికల్స్‌కు అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారికి మార్చి 16 నుంచి ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 10వ తేదీలోపు ఇంటర్ ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.