08-05-2025 07:17:42 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జి.యం. వి.కృష్ణయ్య ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల వారసులకు జి.యం కార్యాలయంలో గురువారం ముఖాముఖీ (ఇంటర్వ్యూ) నిర్వహించారు. ఈ సందర్భముగా సి.హెచ్.పి. ఇంజనీర్ క్రిస్టఫర్ మాట్లాడుతూ.. ఇల్లందు ఏరియా వర్క్ షాప్ నుండి కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసురాలికి వారి కుటుంబ సభ్యుల, సాక్షుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అన్నివివరాలు నమోదు చేయడమైనదని, ఇంటర్వ్యూలు పూర్తి అయిన తరువాత వైద్యపరీక్షల కొరకు పంపించి తరువాత నియామక ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా వర్క్ షాప్ డి.జి.యం.నాగరాజు నాయక్, ఏరియా డి.జి.యం. (పర్సనల్) జి.వి.మోహన్ రావు, సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్, క్లార్క్స్ శ్రీనివాస్, అపర్ణ, తదితరులు పాల్గొన్నారు.