20-06-2025 12:00:00 AM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్19( విజ యక్రాంతి): కేసుల ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు.గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోక్సొ, ఎస్టీ, ఎస్సీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపాలి అన్నారు.
ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేస్తూ బాధితులకు న్యాయం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా ఆపించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సం బంధిత అధికారులతో చర్యలు చేపట్టాలన్నా రు. ఈ సమావేశంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.