03-09-2025 04:27:05 PM
ధర్మపురి (విజయక్రాంతి): వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి, కుమ్మరిపల్లి, పాషిగామ, ముత్తునూర్, రాంనూర్ లోని ప్రాథమిక పాఠశాలలో తాత్కాలిక బోధకులు, ఆయాలుగా పనిచేయుటకు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్థులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ప్రభాకర్(MEO Prabhakar) ఒక ప్రకటనలో తెలిపారు. బోధకులుగా పనిచేసే వారికి ఇంటర్మీడియట్, ఆయాలుగా పనిచేసేవారికి ఏడవ తరగతి పాసై 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కల్గి ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉండాలన్నారు. బోధకులకు రూ.8000 ల చొప్పున,ఆయాలకు రూ.6000 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఎంపీక తాత్కాలికమైనదనీ, వార్షిక సంవత్సరంలో 10 నెలలకు మాత్రమే గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మండల విధ్యావనరుల కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.