రామప్పను సందర్శించిన ఐపీఎస్ సోయి శివైన్
20-07-2026 12:00 AM
వెంకటాపూర్, జూలై 19 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయాన్ని ఆదివారం ఏఎస్పీ సోయి శివైన్ ఐపీఎస్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, కాకతీయుల శిల్పకళ వైభవం, యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు విశిష్టతను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం ఏఎస్పీ రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. వారి వెంట స్థానిక ఎస్ఐ చల్లా రాజు, టూరిస్ట్ పోలీసులు బద్రు, శ్రీకాంత్, దశరథ్తో పాటు దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






