17-06-2025 12:00:00 AM
75 డాలర్లకు చేరుకున్న బ్రెంట్ క్రూడాయిల్
ముంబై, జూన్ 16: ఇరాన్ ఉద్రిక్తతలతో చమురు ధరలకు రెక్కలు వ చ్చాయి. వరుసగా రెండో రోజు కూడా చము రు ధరలు పెరిగాయి. అంతర్జాతీయ విపణి లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 75 డాలర్లకు చేరుకుంది. మధ్యప్రాశ్చంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే వరకు ఆయిల్ ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచంలో ఉన్న ఆయిల్ నిల్వల్లో ఇరాన్ వద్దే 9శాతం మేర ఉన్నాయి. ఈ రెండు దేశా ల యుద్ధంతో హార్మౌజ్ జలసంధిపై కూడా తీవ్ర ప్రభావం పడింది.