05-06-2025 01:13:09 AM
మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు
బూర్గంపాడు, జూన్ 4 (విజయక్రాంతి): కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారిలో అంజనాపురం-జింకలగూడెం గ్రామాల మధ్య సీతారామ కాలువపై నిర్మించిన వంతెనపై సిమెంట్ బెడ్డు తొలగిపోయి ఇనుపచువ్వలు పైకితేలాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇను పచువ్వలు ప్రమాదకరంగా ఉన్నాయని వా పోతున్నారు.
నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాం తంలో ఏమాత్రం అక్కడ ఏమరుపాటును ప్రదర్శించినా తేలిన ఇనుపచువ్వలు టైర్లకు తగిలి టైర్లు పగిలిపోయే ప్రమాదముందనీ ,ప్రాణాపాయం జరగకముందే అధికారులు స్పందించి బ్రిడ్జిపై మరమ్మతులు చేసి దాని పైన సిమెంట్ బెడ్డువేయాలని వాహనదారులు కోరుతున్నారు.