calender_icon.png 2 June, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసంబద్ధమైన ఉపాధ్యాయుల సర్దుబాటు నియమాలు మార్చాలి

31-05-2025 06:37:36 PM

బడిబాట కార్యక్రమం పూర్తయ్యాక ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్వహించాలి..

జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రవి...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం చేసే దిశగా అనాలోచితమైన సర్దుబాటు ఉత్తర్వులు ఉన్నాయని, 2015 నాటి అసంబద్ధమైన రేషనలైజేషన్ నిబంధనలు పాటించాలనడం విడ్డురమని, ప్రభుత్వమిచ్చిన రేషనలైజేషన్ నిబంధనలు ప్రాథమిక విద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని పి ఆర్ టి యు టీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవి(PRTU TS District General Secretary B Ravi) అన్నారు.

శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 60 మంది పిల్లల వరకు 2 టీచర్లు అని నిబంధనలు విధించడం పూర్తి అసమంజసం అన్యాయం ఈ ఉత్తర్వులను సవరించి  30 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లను ఏర్పాటు చేయాలన్నారు. అప్పుడే ప్రాథమిక విద్యావ్యవస్థ పటిష్టమై ఉన్నత పాఠశాలకు వచ్చే విద్యార్థులు నాణ్యమైన ప్రమాణాలతో వస్తారన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో LFL HM ఉండాలని ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేసి ఆ సంఖ్యను కూడా సర్దుబాటు నిబంధనలోకి పరిగణలోకి తీసుకోవాలని, ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున తదుపరి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు జూనియర్ ఉపాధ్యాయున్నీ సరప్లస్ గాగా చూపించాలని ఉంది.

ఆ ఉత్తర్వులను సవరించి సీనియర్ ఉపాధ్యాయునికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, లేని పక్షంలో జూనియర్ ఉపాధ్యాయుడు తప్పకుండా వెళ్ళే విధంగా సవరణ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు పెట్టి, విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తుండడం జరిగిందన్నారు. దాని రిజల్ట్ తో జూన్ మాసం చివరి వరకు ముమ్మాటికీ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన బడిబాటను ప్రస్తుతం నడుస్తున్న తల్లిదండ్రుల మోటివేషన్ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా గత సంవత్సరం విద్యార్థుల సంఖ్యను ఆధారంగా ఆగమేఘాల మీద రేషన్లైజేషన్ ప్రకటించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయడమే అవుతుందన్నారు. విద్యాశాఖ అధికారులు ఈ సర్దుబాటు ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర భాద్యులు కిషన్, మండల భాద్యులు లక్ష్మణ్, మోహన్, నగేష్ నాయకులు బిక్కులాల్, లక్ష్మణ్, శ్రీనివాస్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.