29-10-2025 12:18:24 AM
ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో రాష్ట్ర నాయకుల సమావేశం
పరిశీలకుల నివేదికపై చర్చ
ఉమ్మడి జిల్లాలో ఆసక్తికర చర్చ
సంగారెడ్డి, అక్టోబర్ 28 (విజయక్రాంతి) :రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టేనా అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతుంది. ఇటీవల పార్టీ పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. ఆ నివే దికను జాతీయ నాయకత్వానికి అందించా రు.
దీనిపై ఇటీవల ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని ఏఐసీసీ పరిశీలకులతో నివేదికలపై చర్చించారు. మరికొద్ది రోజుల్లో అధ్యక్షుల పే ర్లు ఖరారవుతాయని పార్టీలో ప్రచారం సాగుతుంది.
క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ...
ఇటీవల ఏఐసీసీ పరిశీలకులు ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన పీసీసీ ప్రతినిధు లతో కలిసి వారు క్షేత్రస్థాయిలో పర్యటించా రు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక విధానంలో జా తీయ నాయకత్వం సూచించిన విధంగా అభిప్రాయ సేకరణ చేశారు.
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఆరుగురు నేతల పేర్లతో కూడిన నివేదికను అందజేశారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ పేర్ల పై రాష్ట్ర నేతలతో ఏఐసీసీ పరిశీలకులు చర్చించారు. ఆయా జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. అనే అంశాలను రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వంతో చర్చించినట్లు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లా ఆధారంగా..
జిల్లా నుంచి వివిధ సామాజికవర్గాలకు చెందిన ఆరుగురు నేతల పేర్లు సూచించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఆయా సామా జికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమతూకం పాటించాలని పార్టీ భావిస్తోంది. ఓ జిల్లాలో ఓసీకి కేటాయిస్తే, మిగతా జిలా ్లల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇందులో మహిళా ప్రాతినిధ్యాన్ని కూడా పరిశీలిస్తారని అభిప్రాయ పడు తున్నారు. మొత్తంగా ఢిల్లీలో ఈ ప్రక్రియపై చర్చించి ఆయా జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసి వీలైతే ఈనెల చివరిలోగా లేనిపక్షంలో నవంబర్ మొదటి వా రంలో డీసీసీ అధ్యక్షులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఐదేళ్ల ప్రాతినిధ్యం..
డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో పార్టీ జాతీ య నాయకత్వం దేశ వ్యాప్తంగా ఒకే నియమావళిని అనుసరిస్తుందని పార్టీ నాయకు లు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని రా ష్ట్రాల్లో ఆ పద్ధతిలోనే అధ్యక్షుల ఎంపిక జరిగిందని చెప్పుకుంటున్నారు.
పార్టీలో కనీసం ఐదేళ్ల ప్రాతినిధ్యం ఉన్న వారికే అధ్యక్షుడి హోదా కల్పిస్తున్నారని, ఈ విషయంలో పా ర్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా పరిశీలన చేస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే పార్టీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చేరిన పలువురు నాయకుల ఆశలపై నీళ్లు చల్లేపరిస్థితిఉంది.