calender_icon.png 19 June, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డయాగ్నస్టిక్ హబ్‌కు నిధుల లేమి?

19-06-2025 01:12:17 AM

  1. రెండు నెలలుగా నిలిచిన రక్త పరీక్షలు 
  2. ఇబ్బంది పడుతున్న రోగులు

నిజామాబాద్ జూన్ 18: (విజయక్రాంతి) గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ లో 56  రకాల రక్త పరీక్ష లు చేపట్టేది. రోగులకు సౌకర్యంగా ఉన్న ఈ స్కీము నిధులు లేమీ తో గత రెండు నెలలుగా స్తంభించిపోయింది.

నిత్యం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆస్పత్రిలో నుండి సేకరించిన రక్త నమూనాల పరీక్షలు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి నమూనాల పరీక్ష నిమిత్తం వస్తుంటాయి. రక్త నమూనా పరీక్షలకు అవసరమయ్యే కెమికల్స్ రిలేజేర్స్ ను ఇప్పటిప్రభుత్వం సరఫరా చేయకపోవడం వల్లరోగుల రక్త పరీక్షలు నిలిచిపోయాయి.  వివిధ రక్త పరీక్షల కొరకు వచ్చే రోగుల నమూనాలు పరీక్షలు కాకుండా నిలిచిపోయాయి. 

నిత్యం పరీక్ష నమూనాలు

గత ప్రభుత్వంలో నిధులు విడుదల చేయడంతో నిరాటకంగా సాగిన రక్త నమూనా పరీక్షలు ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రోగుల తాలూకు రక్త పరీక్షలు జరగడం లేదు. ప్రస్తుతం 56 పరీక్షలకు గాను కేవలం 22 రక్తనమున పరీక్షలు మాత్రమే తెలంగాణ తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ లో చేపడుతున్నారు. అసలే వర్షాకాలం అంటువ్యాధుల సీజన్ ప్రారంభమైంది.

ఈ వర్షాల సమయంలో సీజనల్ డిసీజెస్ వ్యాప్తి చెందకుండా ప్రాథమికంగా జబ్బు పడినవారు ఆసుపత్రులకు వచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. వారి రోగనిర్ధారణకై వివిధ రక్త నమూనా పరీక్షలను వైద్యులు సిఫారసు చేయడంతో సకాలంలో వైద్య పరీక్షలు అందక రక్త నమూనాల్లో వ్యాధుల తాలూకు వివరాలు తెలియక రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

అత్యంతరం లేని స్థితిలో కొందరు వేలకు వేలు డబ్బులు వెచ్చించి ప్రైవేట్ ల్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు.  నిజామాబాద్ కేంద్రంలోని డయాగ్నొస్టిక్ అబ్బో(టిడి హబ్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో రక్త నమూనా పరీక్షలకు అవసరమయ్యే ముడి సరుకులు కెమికల్స్ ని ఏజెన్సీలు సరఫరా చేయడం లేదు. గతంలో ఏజెన్సీలు సరఫరా చేసిన మెటీరియల్ తాలూకు డబ్బులు అందకపోవడంతో వారు సరఫరాను నిలిపివేశారు.

ఫలితంగా వైద్యుల రోగనిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని వైద్య కేంద్రాలలో కలుగుతున్న ఈ అసౌకర్యాన్ని సంబంధిత శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చి వివిధ రకాల రక్త నమూనా పరీక్షలను రోగ నిర్ధారణ జరిగి రోగులకు సత్వరమే చికిత్సందే విధంగా చర్యలు తీసుకోవాలి.

నిత్యం రోగులకు అవసరం పడే ఆర్బిఎస్ రాండమ్ బ్లడ్ షుగర్, హెచ్ బి ఏ వన్ సీ, సిరామ్ క్రియేటింగ్, సి రం కొలెస్ట్రాల్, సిరం ఆల్ఫాబెమిన్, థైరాయిడ్ టి ఫోర్ తదితర పరీక్షలు నిత్యం అవసరం ఉండగా సరైన కెమికల్స్ అందుబాటులో లేకపోవడంతో పరికరాలు అందుబాటులో లేకపోవడంతో రోగుల తాలూకు శాంపిల్స్ సేకరించినప్పటికిని ఈ పరీక్షలు జరగడం లేదు.

గర్భిణీ స్త్రీలకు సంబంధించి పరీక్షలు సర్జికల్ ప్రొఫైల్స్ పరీక్షలు జరగడం లేదు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తూనే గాని రోగులకు పై సేవలను పునరుద్ధరించడం జరుగుతుందని రోగుల తాలూకు బంధువులు ప్రజలు వాపోతున్నారు.