19-06-2025 01:07:29 AM
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ‘పలు రకాల పరిస్థితుల్లో ప్రాధాన్యతలు మా రిఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి వన్ టైం సెటిల్మెంట్ కింద ఫీజులు చెల్లి స్తాం’ అని గతేడాది జూలై 13న జేఎన్టీయూహెచ్లో క్వాలిటీ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో సీఎం చేసిన వ్యా ఖ్యలివి. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా తమ ఖాతాలో జమకాలేదని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నాయి.
ఫీజు బకాయిలకు ప్రభుత్వం టోకె న్లు ఇచ్చి చేతులు దులుపుకుంటోందనే విమర్శలున్నాయి. ఇచ్చిన టోకెన్లకు డబ్బులు జమా కావడంలేదని అంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. 2022 నుంచి ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయా యి. 2022 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లకు జారీ చేసిన టోకెన్లకు ఇంత వరకూ నిధులు జమకాక పోవడం గమనార్హం.
న్యాయస్థానానికి ఆశ్రయిస్తున్న కాలేజీలు
రాష్ట్రంలో ప్రతి విద్యాసంవత్సరం సుమా రు 12 లక్షలకుపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటా రు. ఇందుకు ఏటా రూ.2,300 కోట్లను ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుం ది. 2022- 23 విద్యాసంవత్సరం నుంచి బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడంలేదు. వీటిలో రూ.2 వేల కోట్లకు టోకెన్లను ప్రభుత్వం గతంలోనే జారీ చేసింది.
ఆ డబ్బులను మాత్రం విడుదల చేయలేదు. గత ఎ మ్మెల్సీ ఎన్నికల్లో కొంత మేర బడ్జెట్ విడుద ల చేసినప్పటికీ పూర్తిస్థాయి నిధులను ఇంత వరకూ జమచేయ లేదు. దీంతో కొన్ని కాలేజీలు ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ విద్యార్థులకు మెలికపెడుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.
ఈ క్రమంలోనే ఫార్మసీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, లా, డిగ్రీ కోర్సులు అందిస్తున్న 100 వరకు కాలేజీలు కోర్టును ఆశ్రయించాలనుకుంటున్నా యి. ఇప్పటికే కొన్ని కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని కళాశాలల యాజమాన్య సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
నిర్వహణ భారం తడిసి మోపెడు
రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిల్లో గత ప్రభుత్వం పెండింగ్లోనివి దాదాపు రూ.3 వేల కోట్ల వరకు ఉంటాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏ సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఆ ఏడాదిలో విడుదల చేస్తే సమస్యే ఉండదంటున్నా రు. రూ.లక్షలు...రూ.కోట్లల్లో పెట్టుబడులు పెట్టి కళాశాలలను నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం సకాలంలో ఫీ జు బకాయిలు చెల్లించకుంటే కళాశాలలను నడపలేమంటున్నారు.
వాస్తవా నికి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను మూడు నెలలకోసారి వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. విద్యాసంవత్సరం ప్రా రంభంలో 25 శాతం, మధ్యలో 50 శాతం, విద్యాసంవత్సరం చివర్లో మరో 25 శాతం చెల్లించాలి.
కానీ ఇది గత ప్రభుత్వం నుంచే అమలుకు నోచుకోలేదు. రూ.2 వేల కోట్ల టోకెన్లను ఈ నెలలోగా చెల్లించాలని, 2023 విద్యాసంవత్సరానివి రూ.4,500 కోట్లు మూడు నెలల్లో, 2024-25 ఏడాదివి ఆరు నెలల్లో, 2025-26వి నాలుగు ఇన్స్టాల్మెంట్లలో చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.
సీఎంను కలిసిన తర్వాత కార్యాచరణ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. తొలుత టోకెన్ అమౌంట్ రూ.2 వేల కోట్లను విడుదల చేయాలి. ప్రభుత్వం కాలేజీలపై టాస్క్ ఫోర్సును పంపించి భయపెట్టిస్తే భయపడం. వారంలో సీఎంను కలిసిన తర్వాత మా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం.
మంత్రులు, అధికారులకు దీనిపై వినతిపత్రాలు సమర్పిస్తాం. రైతులు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినట్టుగానే మాకు కూడా బడ్జెట్ విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం దృష్టిలో లాస్ట్ ప్రియార్టీలో ఉన్నది. ప్రభుత్వం మాతో మాట్లాడాలి. బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు మూతపడే పరిస్థితి తలెత్తింది.
రమేశ్బాబు,
ఎఫ్ఏటీహెచ్ఐ చైర్మన్