09-06-2025 12:55:45 AM
నరేంద్ర స్వామి మహారాజ్
జుక్కల్, జూన్ 8 (విజయ క్రాంతి) : ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి శివారులో గల నానీజ్ ధాం ఉప పీఠంలో ఆదివారం జరిగిన ప్రవచన కార్యక్రమంలో నరేంద్ర స్వామిజీ మహారాజ్ అన్నారు. ఈ సందర ్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా యువత చెడు అలవాట్లను మానివేసి హిందూ ధర్మంలో ఉన్న విలువలను కాపా డాలని సూచించారు.
తమకు తాము సక్ర మంగా బాధ్యతలు నిర్వహించుకుంటే దేశ భక్తి మరింతగా పెరుగుతుందని, హిందూ ధర్మంపై నమ్మకం కూడా పెరుగుతుంద న్నారు. తెలంగాణలోని మారుమూల మండలమైన జుక్కల్ లో ఉపపీఠం ఏర్పాటు చేయడానికి గల కారణాలను ఆయన వివరించారు.
తమ ప్రధాన పీఠమైన నానీజ్ధాం భక్తులకు చాలా దూరంగా ఉందని, అందుకోసమే ఇక్కడ ఉప పీఠం నెలకొల్పడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రతిరోజు పూజలు భజనలు జరుగుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వెంట బిఆర్ఎస్ నాయకులు రమేష్ ఘోట్కే, రాజశేఖర్ పటేల్, బొల్లి గంగాధర్, కిరణ్ కాంబ్ళే తదితరులు పాల్గొన్నారు.